తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వీధి పోరాటాలు షురూ అయ్యాయి. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసూకుంటున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై పార్టీ సీరియస్ అయ్యింది. దీంతో కోమటిరెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు.
దీనిపై స్పందించిన కోమటిరెడ్డి షోకాజ్ నోటీస్ తీసుకునే లేదని, పార్టీ అధ్యక్షురాలు సోనీయాగాంధీ దగ్గరే విషయం తేల్చుకుంటామని అంటున్నారు. అమెరికా నుంచి వచ్చిన కోమటి రెడ్డి ఆ మర్నాడే మంత్రి హరీష్ రావును కలుసుకున్నారు.
అనంతరం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్దిపై విమర్శలు సంధించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్ష పదవికి అనర్హుడని, పొన్నాల కంటే ఈయన మరీ దారుణమంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయిన పార్టీ క్రమశిక్షణ సంఘం కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.