- Advertisement -
కరోనా సహా అత్యవసర పరిస్ధితులు తలెత్తినప్పుడు సహాయం చేసేందుకు ఏర్పాటు చేసిన పీఎం-కేర్స్ పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతూ.. దేశంలోని 100మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. పీఎం-కేర్స్ లబ్దిదారులు, ఖర్చులకు సంబంధించిన ఆర్థిక వివరాలను.. ప్రజా జవాబుదారీ ప్రమాణాలను అనుసరిస్తూ బయటపెట్టాల్సిన అవసరం ఉందని వారు ఈ లేఖలో పేర్కొన్నారు.
పీఎం-కేర్స్పై జరుగుతున్న చర్చను నిశితంగా గమనిస్తున్నామని తెలిపిన మాజీ ఐఏఎస్ అధికారులు… దాని నిర్వహణలో జవాబు లేని అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయని అన్నారు. ప్రధానమంత్రి హోదాకు భంగం వాటిల్లరాదంటే.. ఆయనతో ముడిపడిన అన్ని అంశాల్లోనూ పూర్తి పారదర్శకత ఉండాల్సిన అవనసరం ఉందని అభిప్రాయపడ్డారు.