సూర్యాపేట: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసేవారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి మోసపూరిత ఉదంతాల గురించి ఎన్ని విషయాలు వెలుగు చూసినా ఉద్యోగంపై ఆశతో యువకులు మోసపోతూనే ఉన్నారు. అయితే అధికార పార్టీ నేత చేతిలోనే మోసపోయిన
కొందరు యువకులు ఎదురు ప్రశ్నించి తన్నులు తిన్న ఓ తాజా సంఘటన వెలుగులోకి వచ్చింది. అతని పేరు సంతోష్, టీఆర్ఎస్ పార్టీ నేత అని, మంత్రి జగదీశ్కు అనుచరుడనని చెప్పుకుని మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడేవాడని మీడియాలో వార్తలొచ్చాయి. ఈయనగారు చైర్లో కూర్చుని అతని కాళ్ల దగ్గర కింద కూర్చొని ఉన్న ఇద్దరు యువకులను కాళ్లతో గెండెల మీద, కడుపు మీద తన్నిన దశ్యాలు మీడియాకు దొరికాయి. ఈ సంతోష్ది నల్గొండ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన సూర్యపేట జిల్లా, స్థానికంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, నేతగా బాగానే గుర్తింపు ఉందట. దీంతో ఇతని మాటలపై నమ్మిన పలువురు యువకులు మోసపోయారు. లక్షల్లో డబ్బులను యువకుల నుంచి తీసుకున్నాడు కానీ ఉద్యోగాలు మాత్రం చూపించలేదట.
రోజులు గడుస్తున్నాయి గానీ ఫలితమేమీ కనిపించకపోవడంతో ఎదురు ప్రశ్నించారు ఇద్దరు యువకులు. కేసు పెడతామని కూడా అన్నట్టున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన ఆయనగారు తన కాళ్ల ఎదురుగా కింద కూర్చున్న యువకులను చాతిపై తన్ని, బండ బూతులు తిట్టాడు. రివాల్వర్ తీసుకురండిరా అంటూ తన అనుచరులను ఆదేశించేసరికి ఆ ఇద్దరు యువకులు భయోత్పాతానికి గురయ్యారు. ఈ దృశ్యాలన్నీ మీడియాకు చిక్కాయి. చివరికి డబ్బుల సంగతి దేవుడెరుగు, బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి బయటపడ్డారు ఆ యువకులు. ఇప్పుడు ఇతనిపై తగిన చర్యలు తీసుకునే అవకాశముంది.