సాధారణంగా అధికార పక్షాన్ని ఏ చిన్న ఛాన్స్ దొరికినా ఏకి పారేయడం ప్రతిపక్షాల పని అని తెలిసిందే. అలాంటింది ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు పై ప్రశంసలు కురిపించారు ప్రతి పక్ష నేత టీ పీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. వివరాల్లోకి వెళ్తే.. టీ పీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట ప్రభుత్వని సందర్శించారు.
ఈ సందర్భంగా కొవిడ్ చికిత్స తీసుకుంటున్న వారితో మాట్లాడారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. అదే విధంగా హుజూర్నగర్, కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితులు సైతం అడిగి తెలుసుకున్నారు.
ఎంపీగా దవాఖానల్లో సౌకర్యాలు కల్పించేందుకు తన సహకారం ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య బృందాల సేవలు సంతృప్తి కరంగా ఉన్నాయని అన్నారు.
బాలయ్య పుట్టిన రోజుకు పెద్ద గిఫ్ట్.. ఏంటంటే?