Tuesday, May 14, 2024
- Advertisement -

మరో 20 రూట్లలో ట్రూజెట్‌ విమాన సర్వీసులు

- Advertisement -
  • మార్చ్‌ 25 న చెన్నై- సేలం సర్వీస్‌ ప్రారంభం
  • త్వరలో అహ్మదాబాద్‌, గౌహతి నుంచి సర్వీసులు

ప్రాంతీయ విమానయాన సంస్థగా సేవలు ప్రారంభించిన ట్రూజెట్‌ అనతి కాలంలోనే జాతీయ విమానయాన సంస్థగా ఎదిగింది. త్వరలో దేశవ్యాప్తంగా మరిన్ని సర్వీసులను ప్రారంభించనుంది. మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ గ్రూప్‌ కంపెనీలో భాగమైన టర్బో మేఘా ఎయిర్వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ‘ట్రూజెట్‌’భారత్‌ నలుమూలల నుంచి విమాన సేవలను విస్తరించనుంది. త్వరలో దేశవ్యాప్తంగా మరో 20 రూట్లలో తన సేవలను ప్రారంభించనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, అస్సోం రాజధాని గౌహతి నుంచి ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాలకు విమానాలు నడపనుంది.

ఇప్పటికే హైదరాబాద్‌ కేంద్రంగా రోజూ 12 పట్టణాలకు కనీసం 2 వేల మంది ప్రయాణికులను తీసుకువెళుతున్న ట్రూజెట్‌ త్వరలో తన సామర్థ్యం నాలుగింతలకు పెంచుకోవాలనే లక్ష్యంతో కార్యకలాపాలను విస్తరిస్తోంది. సాధారణంగా దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో విమానయాన సేవలు ప్రారంభించేందుకు పేరేన్నికగన్న సంస్థలు కూడా ముందుకు రాని సందర్భంలో మేఘా టర్బో ట్రూజెట్‌…. అస్సాం కేంద్రంగా ఈశాన్య రాష్ట్రాల్లో సేవలు విస్తరించబోతోంది.

ఉడాన్‌ పథకం రెండో దశ కింద తమ సంస్థ 20 రూట్లలో విమానాలు నడిపేందుకు అనుమతి పొందిందని ట్రూజెట్‌ సంస్థ వాణిజ్య వ్యవహారాల పర్యవేక్షణ అధికారి సెంథిల్‌ రాజా తెలిపారు. తాము అనుమతి పొందిన రూట్లలో అహ్మదాబాద్‌ నుంచి గుజరాత్‌లోని పోరుబందర్‌, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌, మహారాష్ట్రలోని నాసిక్‌, జగావ్లతో పాటు గౌహతి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లోని కుఛ్బిబెహర్‌, బురన్పూర్‌, తేజు, తేజ్‌పూర్‌ తదితర మార్గాలు ఉన్నాయ్‌ అని ఆయన వెల్లడించారు. ఈ నెల 25న తమిళనాడు రాజధాని చెన్నై నుంచి తమ సంస్థ విమాన సర్వీసులు ప్రారంభిస్తుందని రాజా తెలిపారు.
రెండేళ్లలో 10 లక్షల మంది ప్రయాణం…


సంస్థని స్థాపించిన రెండు సంవత్సరాల్లోనే పది లక్షల మంది ప్రయాణికులను దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేసిన ట్రూజెట్‌ దేశంలోని మారుమూల ప్రాంతాలకు విమానాలు నడపడం ద్వారా దేశ విమానయాన చిత్రపటంలోకి ఆ పట్టణాలను ఎక్కించే ప్రయత్నం చేస్తోంది.

త్వరలో మరో ఏడు విమానాలు…


ప్రస్తుతం ట్రూజెట్‌ సంస్థ ఐదు విమానాల ద్వారా ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు తీసుకెళుతోంది. ఐదు విమానాలకు తోడుగా మరో ఏడు విమానాలను వాటి సరసన త్వరలో చేర్చబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉదాన్‌ పథకం తోలి దశలో 18 రూట్లను పొందిన ట్రూజెట్‌ ఆయా ప్రాంతాలకు ఇప్పటికే విమాన సర్వీసెస్‌ను ప్రారంభించింది. సర్వీసెస్‌ ప్రారంభించిన నగరాల్లో హైదరాబాద్‌ నుంచి ముంబై , ఔరంగాబాద్‌, చెన్నై, గోవా, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, కడప, రాజమండ్రి, మైసూర్‌, విద్యానగర్‌ ఉన్నాయి. హైదరాబాద్‌-ఔరంగాబాద్‌ మధ్య విమాన సర్వీస్‌ నడుపుతున్న సంస్థ ట్రూజెట్‌ ఒక్కటే. తమ విమానాల్లో టికెట్‌ ప్రారంభ ధర 599 రూపాయలేనని రాజా పేర్కొన్నారు.
ప్రయాణికులకు ఉచితంగా అల్పాహారం, ఆహారం అందిస్తూ మెరుగైన సేవలు నిర్వహిస్తున్న సంస్థగా మేఘా టర్పో ట్రూజెట్‌ ప్రసిద్ధికెక్కింది. వీటికి తోడు ప్రయాణికులకు అధునాతన ఎంటర్‌టైన్‌మెంట్‌ సౌకర్యాలను అందజేస్తోంది. స్నేహితులు, కుటుంబసభ్యులు గ్రూప్‌బుకింగ్స్‌ చేసుకుంటే వారికి వివిధ ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తోంది. అదేవిధంగా ట్రూజెట్‌ బి ప్లాన్‌ క్రింద మధ్య, చిన్నతరహా ఎంటర్‌ప్రైజులకు ప్రత్యేక సదుపాయాలను అందిస్తోంది. అలాగే కార్పోరేట్‌ రంగంలోని వారికి, తరచూ ప్రయాణించేవారికి ఫ్లాట్‌ రేటు విధానం క్రింద ప్రయాణికులకు అనుకూలమైన చార్జీలను వసూలు చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తే కాన్సిలేషన్‌ ఫీజు కూడా అతి తక్కువగా ఉంటోంది అని సెంథిల్‌ రాజ తెలియ జేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -