- Advertisement -
జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు పారిశ్రామిక వేత్త శ్రీను రాజు లీగల్ నోటీసు ఇవ్వబోతున్నారనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. టీవీ 9 అధినేత, పారిశ్రామిక వేత్త శ్రీనురాజు, టీవీ 9 రవి ప్రకాష్, నారా లోకేష్ మరి కొందరు రామ్ గోపాల్ వర్మతో కలిసి తనపై కుట్ర చేసారని పవన్ పదే పదే ట్వీట్ లు చేచేసిన సంగతి తెలిసిందే.
ఈవ్యవహారంపై మెగా ఫ్యామిలీకూడా సీరియస్గా తీసుకుంది. ఉదయం ఫిల్మ్ఛాంబర్లో పవన్ కళ్యాన్ నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.అయితే ఈ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపులు తిరుగుతోంది. పవన్ చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని, లేదా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటూ, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసు ఇచ్చే ఆలోచనను శ్రీను రాజు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.