Wednesday, May 1, 2024
- Advertisement -

కాకినాడ పోర్టులో భారీ ప్ర‌మాదం..కుప్ప‌కూలిన రెండు భారీ క్రేన్‌లు..

- Advertisement -

కాకినాడ సీపోర్టు లిమిటెడ్‌లో భారీ ప్ర‌మాదం చోటుచేస‌కుంది. రెండు భారీ క్రేన్‌లు కుప్ప కూల‌డంతో ఒక‌రు మృతి చెంద‌గా , ప‌దిమందికి తీవ్ర గాయాల‌య్యాయి. మరి కొంత మంది క్రేన్ల కింద చిక్కుకున్నారు. పాత క్రేన్‌కు మ‌ర‌మ్మ‌త్తులు చేస్తుండ‌గా ఈ ప్ర‌మాదం సంభ‌విచిన‌ట్లు తెలుస్తోంది. అధికారులు స‌హాయ కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తున్నారు.

మాదం అనంతరం క్షతగాత్రులను పోర్టు అధికారులు సమీపంలోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. భారీ బ‌రువుల‌ను సైతం ఎత్త గ‌ల క్రేన్‌లు కుప్ప కూలడంతో ఆప్రాంతం ద‌ద్ద‌రిల్లింది. పాత క్రేన్‌కు మ‌ర‌మ్మ‌త్తుల స‌మ‌యంలో క్రేన్ ఒక్కసారిగా విరిగిపోయి కొత్త క్రేన్ పై పడిపోయిందని వెల్లడించారు. దీంతో రెండు క్రేన్లు కుప్పకూలిపోయాయని అక్క‌డి అధికారులు పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -