Saturday, May 18, 2024
- Advertisement -

పరిటాల శ్రీరామ్ పెళ్లి పనుల్లో విషాదం

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ మంత్రి పరిటాల సునీత తనయుడు.. ఏపీ అధికారపక్ష నేత పరిటాల శ్రీరామ్ పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే. ఎంగేజ్మేంట్ కూడా ఈ మధ్యనే.. భారీగా నిర్వహించారు. మరి కొద్ది రోజుల్లో వివాహం జరగనుంది. ఇది ఇలా ఉంటే.. ఈ పెళ్లి వేడుక అనంతపురం జిల్లాలో జరగునుంది.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు ఒక బృందం హైదరబాద్ నుంచి అనంతపురం బయలుదేరింది. పెళ్లి పనుల కోసం వేళ్తున్న డెకరేషన్ సామాగ్రి.. డీసీఎం దారుణ ప్రమాదానికి గురైంది. బాలానగర్ శివారులోని పెద్దాయపల్లి వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై అదుపు తప్పిన డీసీఎం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పెళ్లి పనుల కోసం వెళ్తున్న వారిలో ఇద్దరు మరణించారు. డ్రైవర్.. క్లీనర్ తో పాటు మరో ముగ్గురు గాయపడినట్లుగా సమాచారం.

నిద్ర మత్తులో నడిపిన డ్రైవర్ కారణంగానే ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ ఘోర ప్రమాదంలో గాయపడిన డ్రైవర్.. క్లీనర్ తో పాటు మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. వచ్చే నెల (అక్టోబరు 1న) లో జరగనున్న పెళ్లి వేడుకలకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచే మొదలెట్టారు. ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం పలువురిని విషాదంలో నింపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -