తెలంగాణలో కొత్త పార్టీకి సిద్ధమవుతున్న వైఎస్ షర్మిల ఇప్పటికే పలు కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకు వెళ్తుంది. ఖమ్మం లో భారీ సభ ఏర్పాటు చేసి తెలంగాణ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఈ మద్య తెలంగాణ లో నిరుద్యోగుల సమస్యపై పోరాడుతూ 72 గంటల నిరాహార దీక్ష చేశారు.
వైఎస్ షర్మిలకు 15 రోజుల క్రితం ప్రభుత్వం 2ప్లస్2 గన్మెన్లను కేటాయించింది. తాజాగా ఆ భద్రతను ప్రభుత్వం ఉపసంహరించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెబుతున్న షర్మిల ఇటీవల పలు జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.
నిరుద్యోగులకు మద్దతుగా ఇటీవల షర్మిల చేపట్టిన దీక్ష ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె చేయికి గాయం కూడా అయ్యింది. తాజాగా ప్రభుత్వం భద్రతను ఉపసహరించుకున్నట్టు వార్తలు రావడం గమనార్హం.
థానేలో మరో ఘోరం.. ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
దుమ్మురేపుతున్న ‘టక్ జగదీష్’ టీజర్..!
నంద్యాలలో విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం మొత్తం ఆత్మహత్య