తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకీ అంతకంతకు వికృతరూపం ప్రదర్శిస్తోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10వేలను క్రాస్ చేసింది. కాగా, తెలంగాణ వ్యాప్తంగా కరోనా బారినపడి 2,094 మంది ప్రాణాలొదిలారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 69,221 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదిలా ఉంటే.. కరోనా మహమ్మారి పలువురి ప్రాణాలను బలితీసుకుంటోంది. నెల రోజుల్లో ఏకంగా 40 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను పొట్టనపెట్టుకుంది. వీరిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 25 మంది ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 12 మంది ఉపాధ్యాయులు కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు.
జగిత్యాల జిల్లాలో ఇద్దరు, కుమురంభీం, ఆసిఫాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఒక్కొక్కరు, మంచిర్యాల జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ జిల్లాలో గత నాలుగు రోజుల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. కాగా, మార్చిలో 20 మంది, ఏప్రిల్లో 40 మంది ఉపాధ్యాయులు కరోనాకు బలైనట్టు పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు తెలిపారు.
థానేలో మరో ఘోరం.. ఆసుపత్రిలో అగ్నిప్రమాదం