Sunday, May 19, 2024
- Advertisement -

తెలుగు మ‌హాస‌భ‌ల పాట‌లో విజ‌య్‌, మెహ‌రీన్‌ చిందులు

- Advertisement -

కొన్ని రోజులుగా పాట షూటింగ్‌

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌నుంది. దీని కోసం అన్నీ ఏర్పాట్లు చ‌క‌చ‌కా పూర్త‌వుతున్నాయి. ఈ మ‌హాస‌భ‌ల నేప‌థ్యంలో తెలుగు భాష‌పై ఓ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. తెలుగు మ‌హాస‌భ‌ల కోసం రూపొందిస్తున్న పాట‌లో అర్జున్‌రెడ్డి ఫేమ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, హీరోయిన్ మెహ‌రీన్ ఆడిపాడుతున్నారు. ఈ విశేషాల‌ను విజ‌య్ ట్విట్ట‌ర్‌లో చెప్పారు. మెహ‌రీన్‌తో కలిసి హోలీ పాటలో నటిస్తున్నట్లు తెలుపుతూ.. ఆమెతో దిగిన సెల్ఫీని పోస్ట్‌ చేశారు. ఈ పాట ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల కోసమ‌ట‌.

ఈ మహాసభల కోసం ప్రముఖ దర్శకులు హరీశ్‌ శంకర్‌, వంశీ పైడిపల్లి కలిసి ఓ ప్రత్యేక పాటను తెరకెక్కిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ, మెహరీన్‌, ఈషా రెబ్బా తదితరులు నటిస్తున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపడుతూ ఈ పాటను ఉండ‌నుంద‌ని సమాచారం. సెట్‌లో మెహరీన్‌, వంశీ పైడిపల్లి, యూనిట్‌ సభ్యులతో దిగిన ఫొటోలను విజయ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -