Monday, April 29, 2024
- Advertisement -

త్వరలో విజయసాయి రెడ్డి న్యూస్ చానల్.. వాళ్ళే ప్రధాన టార్గెట్ ?

- Advertisement -

పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది వైసీపీ సర్కార్. అయితే మూడు రాజధానులపై అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నప్పటికి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని జగన్ సర్కార్ మొండిగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో మూడు రాజధానుల విషయంలో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ పంథాన్ని నెగ్గించుకునే పనిలో ఉంది జగన్ ప్రభుత్వం. ముందుగా విశాఖ ను పరిపాలన రాజధానిగా మార్చేందుకు అన్నీ విధాలుగా సిద్దమైంది. ఈ నేపథ్యంలో విశాఖ కేంద్రంగా వైసీపీ నేతలు ఇప్పటికే భూములు కొనుగోలు చేశారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖలో భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తన కూతురు అల్లుడి పేరు మీద విశాఖలో .విశాఖలో భూములు కొనుగోలు చేశారని వస్తున్న వార్తలపై విజయసాయి రెడ్డి స్పందించారు. .

తెలుగుదేశం పార్టీని, ఈటీవి అధినేత రామోజీరావు ను లక్ష్యంగా చేసుకొని విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. ఇంతకీ విజయసాయి రెడ్డి ఏమన్నాడంటే.. విశాఖలో భూములు కొంటున్నానని తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని విజయ సాయి రెడ్డి మండి పడ్డారు. పేపర్, టీవి చానల్ చేతిలో ఉందని రామోజీ రావు ఇష్టమొచ్చినట్లు రాస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఏ మీడియా రంగం అండ చూసుకొని దుష్ప్రచారం చేస్తున్నారారో.. అదే మీడియా రంగంలోకి తాను కూడా ప్రవేశించబోతున్నట్లు విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… మీ చానల్ ఎలా పని చేస్తుందో.. తను పెట్టబోయే చానల్ ఎలా పని చేస్తుందో చూసుకుందాం అంటూ రామోజీరావు కు సవాల్ విసిరారు. దాంతో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఆయన న్యూస్ చానల్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాడనేది స్పష్టంగా అర్థమౌతోంది. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే కేవలం టీడీపీ టార్గెట్ గానే మీడియా రంగాన్ని విజయసాయి రెడ్డి వాడుకొనున్నారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read

మునుగోడు రచ్చ : రాజగోపాల్ రెడ్డి.. 18,000 కోట్ల సంగతేంటి ?

మతవిద్వేషాలను మోడీ ప్రోత్సహిస్తున్నారా ?

పవన్ ప్రశ్నలకు సమాధానమేది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -