Thursday, April 25, 2024
- Advertisement -

వ్యాక్సిన్ వేయడానికి వస్తే.. కర్రలతో దాడి చేసి తరిమికొట్టారు!

- Advertisement -

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్‌పై ఉన్న భ‌యం ఇంకా పోలేదు. అది వేయించుకుంటే అనారోగ్యానికి గుర‌వుతామ‌ని భావిస్తున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ వేసుకుంటే కొంతలో కొంత మేలు జరుగుతుందని అంటున్నారు వైద్యులు. కొన్ని వ్యాక్సిన్ పై అసత్య ప్ర‌చారాన్ని న‌మ్మ‌డ‌మే కాకుండా వ్యాక్సిన్ సిబ్బందిపై దాడుల‌కు కూడా దిగుతున్నారు.

తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకోవ‌డంతో వ్యాక్సిన్ సిబ్బంది ప్రాణ భ‌యంతో కారులో పారిపోవాల్సి వ‌చ్చింది. ఉజ్జయిని జిల్లా మెయిల్‌ఖేడీ గ్రామంలో వ్యాక్సిన్ అంటేనే వ‌ణికిపోతోన్న గ్రామ‌స్థుల‌కు అవగాహన కల్పించేందుకు అధికారులు అక్క‌డ‌కు వెళ్లారు. అయితే సిబ్బంది రాకను గమనించిన గ్రామస్థులు క‌ర్ర‌లు ప‌ట్టుకుని సిద్థంగా ఉన్నారు.

వ్యాక్సిన్ సిబ్బంది గ్రామంలోకి అడుగుపెట్ట‌గానే రాళ్లు, కర్రలు పట్టుకుని కొట్ట‌డానికి దూసుకొచ్చారు. కొంద‌రు అధికారులు త‌ప్పించుకుని కారులో పారిపోగా, పంచాయతీ అధికారిణికి మాత్రం తీవ్రగాయాల‌య్యాయి. అనంత‌రం ఆ గ్రామంలోకి పోలీసులు వ‌చ్చి ప‌రిస్థితులు చేజారకుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఒక‌రు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

నటుడు చంద్రమోహన్ పై రూమర్లు.. కొట్టి పడేస్తున్న సన్నిహితులు!

ఎర్రచందనం కేసులో జబర్ధస్త్ కమెడియన్…

నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఎన్టీఆర్ కి కరోనా నెగటివ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -