Friday, March 29, 2024
- Advertisement -

నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఎన్టీఆర్ కి కరోనా నెగటివ్

- Advertisement -

టాలీవుడ్ లో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు సినిమా రంగానికి చెందిన వారు ఎంతో మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో నందమూరి హీరో జూ.ఎన్టీఆర్ కి కరోనా అని తేలింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా తెలియజేశారు. ఎన్టీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ‘‘కరోనా పరీక్షల్లో నాకు కోవిడ్ పాజిటివ్‌ గా తేలింది. ఐతే ప్రస్తుతానికి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను బాగున్నాను. నా ఆరోగ్యం నిలకడగానే ఉంది.

ప్రస్తుతం నేను, నా ఫ్యామిలీ ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ డాక్టర్ల సూచనల మేరకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. కరోనా వైరస్ భారిన పడిన ఎన్టీఆర్ తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఫలితాల్లో కరోనా వైరస్ నెగటివ్ అని తేలింది. అయితే ఈ విషయాన్ని ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కరోనా వైరస్ నెగటివ్ వచ్చిన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.

కరోనా వైరస్ ను చాలా సీరియస్ గా తీసుకోవాలని, అయితే చాలా జాగ్రత్తగా, సేఫ్ గా ఉండటం ద్వారా దీన్ని అధిగమించవచ్చు అని వ్యాఖ్యానించారు. ఆత్మబలం అన్నిటికంటే కూడా అతి పెద్ద ఆయుధం అంటూ చెప్పుకొచ్చారు. మాస్క్ ధరించండి, ఇంట్లోనే ఉండండి అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఇక కరోనా వైరస్ నెగటివ్ అని తేలడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాస్క్ ధరించి ఇంట్లోనే ఉందాం అంటూ చెప్పుకొస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -