ప్రపంచం అడ్వాన్స్ అవుతున్నా ఇంకా వరకట్న వేధింపుల సంఘటనలు జరుగుతూనె ఉన్నాయి. అదనపు కట్నం వేధింపులతో మహిళలు రోడ్డున పడ్డ ఉదంతాలు అనేకం చోటుచేసుకున్నాయి. అలాంటి సంఘటనే విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. వర కట్నం వేధింపులతో నాలుగేళ్ల ఆడబిడ్డతో రోడ్డున పడింది మహిళ. మాయ మాటలతో తీసుకువచ్చి కట్టుకున్న భార్యను, నాలుగేళ్ల బిడ్డను రైల్వే స్టేషన్లో అనాధలుగా వదిలేసి చల్లగా జారుకున్నాడో..ఓ ప్రబుద్ధుడు.
వివరాల్లోకి వెల్తే….ఏలూరు, శాంతినగర్కు చెందిన జానకికీ..విశాఖకు చెందిన చింతపల్లి సందీప్తో.. 2008లో వివాహం జరిగింది. వివాహం సమయంలో..15 లక్షల నగదు, 30 కాసుల బంగారం ఇచ్చారు. సందీప్ రైల్వే ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేసే సందీప్ డబ్బు కోసం, వస్తువుల కోసం అనేక మార్లు భార్య జాణకిని వేధించేవారు. విధుల్లో అలసత్వం వహించడం వల్ల అతన్ని రైల్వే ఏడేళ్ల కిందట సందీప్ సస్పెన్షన్కు గురయ్యాడు. అప్పటి నుంచి మామ గారి ఇంట్లోనె ఉండేవారు.
సందీప్ మామ అధికారులతో మాట్లాడి 2018లో సందీప్ కి మళ్ళీ రైల్వేలో ఉద్యోగం వేయించాడు. చత్తీస్ గడ్, బచేలిలో వీధుల్లో చేరాడు. గత సెప్టెంబర్లో విశాఖ నుంచి బచేలి వెళ్లి ఉద్యోగంలో చేరాడు. అప్పటినుంచి భార్య పిల్లల్ని చూడ్డానికి ఒక్కసారి కూడా రాలేదు. విశాఖ వచ్చినా..తన తల్లి, తన తమ్ముడిని కలిసి వెంటనే బచేలి వెళ్లిపోయేవాడు. విశాఖ వస్తున్నా తనని కలవకపోడంతో జాణకి అత్తారింటిచి వెల్లింది. అక్కడా కూడా నిరాశె ఎదురవడంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ అత్తగారింటి ముందు ఆందోళనకు దిగింది.