Friday, May 17, 2024
- Advertisement -

న‌లుగురు ప్రియుల్ల‌తో క‌ల‌సి భ‌ర్త‌ను ముక్క‌లు ముక్క‌లుగా కోసి హ‌త్య చేసిన భార్య‌..

- Advertisement -

ఇటీవలి కాలంలో ప్రేమించిన వాడి కోసం కట్టుకున్న భర్తను హత్యలు చేయిస్తున్న భార్యల గురించి తరచూ వెల‌గు చూస్తున్నాయి. భార్య‌ల వ్యామోహాల‌కు అమాయ‌కులైన భ‌ర్త‌లు బ‌ల‌వుతున్నారు. వాట్స‌ప్‌, ఫేస్‌బుక్‌ల‌ద్వ‌రా ప‌రిచ‌య‌మై అక్ర‌మ సంబంధాలుకు దార‌తీస్తూ భ‌ర్త‌ల‌ను అమానుషంగా హ‌త్య చేయిస్తున్నారు భార్య‌లు. ప్రియునితో క‌ట్టుకున్న భ‌ర్త‌ను హ‌త్య‌చేయించిన సంఘ‌ట‌న విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఆ సంఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రో సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈసారి ఒకరు, ఇద్దరు కాదు. ఏకంగా నలుగురు ప్రియుళ్లతో కలసి తన భర్తను చంపించిందో యువతి. గోవాలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌త్య‌క్ష సాక్ష ఇచ్చిన స‌మాచారంతో పోలీసులు జ‌ర‌ప‌గా విస్తుపోయో నిజాలు వెలుగు చూశాయి.

కర్ణాటక పరిధిలోని బైల్ హోగెనల్ కు చెందిన బసవరాజ్ బారికి (38), కల్పన (30) భార్యా భర్తలు. వీరు గోవాలో నివాసం ఉంటున్నారు. కల్పనకు రాజస్థాన్ కు చెందిన సురేష్ కుమార్, మార్మగోవాకు చెందిన పంకజ్ పవార్, కుర్చోరెమ్ కు చెందిన అబ్దుల్ షేక్, ఆదిత్య గుజ్జార్ లతో వివాహేతర సంబంధం ఉంది. కల్పన వ్యవహారం భర్తకు తెలిసి నిలదీసేసరికి, అతని అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది.

నలుగురినీ పిలిపించుకుని ప్లాన్ చేసి భర్తను దారుణంగా హత్య చేయించింది. ముందు బసవరాజ్ ను కల్పన తాళ్లతో కట్టగా, అతను కదలకుండా చూసేందుకు ఆదిత్య గుజ్జర్ కాళ్లను పట్టుకున్నాడు. అతన్ని హత్య చేసిన తరువాత మృతదేహాన్ని మూడు ముక్కలు చేసి, గన్నీ బ్యాగుల్లో సర్ది వేర్వేరు ప్రాంతాల్లో పడేయించింది కల్పన.

ఆమె వైఖరిని చూసి అనుమానించిన ఓ వ్యక్తి పోలీసులకు ఉప్పందించగా, వారు కల్పనను విచారించారు. ఆపై మొత్తం హత్య కుట్ర వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఆదిత్య మినహా మిగతావారిని అరెస్ట్ చేశామని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. వీరందరిపై ఐపీసీ 302, 201 కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -