Sunday, May 5, 2024
- Advertisement -

రేపు శుభవార్త చెబుతానన్న కెటిఆర్

- Advertisement -

ఐటి రంగంలో ప్రపంచంలోనే నెంబర్ స్ధానంలో ఉన్న యాపిల్ సంస్ధ తన కార్యాలయాన్ని హైదరాబాద్ లో ప్రారంభించాలనుకుంటోంది. గురువారం నాడు ముందుగా డవలెప్‌మెంట్ సెంటర్ ను ప్రారంభించే యాపిల్ త్వరలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది.

యాపిల్ సిఇవో టిమ్ కుక్ భారత్ వస్తున్న సందర్భంగా ఆ సమయంలో ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. యాపిల్ తన కార్యాలయాన్ని హైదరాబాద్ లో ప్రారంభించడం దాదాపు ఖరారైంది. ఆ సంస్ధ ఇప్పటికే పది కోట్ల డాలర్లతో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. దీంతో యాపిల్ సంస్ధ హైదరాబాద్ కు రావడం దాదాపు పూర్తి అయినట్లే.

ఇదిలా ఉండగా తెలంగాణ ఐటి మంత్రి కె.తారకరామారావు మీడియాతో మాట్లాడుతూ గురువారం నాడు తెలంగాణ ప్రజలకు ఓ శుభవార్త చెబుతానని అన్నారు. ఈ శుభవార్త ఏమిటా అని విలేకరులు తరచి తరచి అడిగినా ఆయన గురువారం నాడు మీకే తెలుస్తుంది కదా అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు. అయితే ఆ శుభవార్త యాపిల్ సంస్ధ ఏర్పాటుకు సంబంధించినదే అని అంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -