Tuesday, May 7, 2024
- Advertisement -

బంగారం లాంటి కూతురు పుట్టింది. అదే రోజు ప‌దవి వ‌చ్చింది!

- Advertisement -

కన్న కూతురిని ఇంటి మ‌హాల‌క్ష్మిగా చెబుతారు. అందుకే ఇప్ప‌టికి ఎంతో మంది త‌మ‌కు కూతురే పుట్టాల‌ని కోరుకుంటారు. అలా ఒక‌రింట్లో మ‌హాలక్ష్మి పుడుతూనే.. మ‌రో సంబురాన్ని కూడా తీసుకొచ్చింది. దీన్ని చూపిన ప‌లువురు.. మీకు మ‌హా ల‌క్ష్మే ప‌ట్టుంద‌ని వారి కుంటుంబాన్ని మెచ్చుకుంటున్నారు. ఇంత‌కీ ఏం జ‌రిగింద‌టే..

వారి ఇంట పుట్టిన మహాలక్ష్మి తల్లికి సర్పంచి పదవి తెచ్చిపెట్టింది. దీంతో ఆ కుంటుంబ స‌భ్యుల ఆనందానికి అవ‌దులు లేకుండా పోయాయి. ఇది కృష్ణా జిల్లా కలిదిండి మండలం కోరుకల్లు గ్రామంలో చోటు చేసుకున్న అరుదైన ఘటన. రెండో ద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో భాగంగా కోరుక‌ల్లు స్థానం మ‌హిళ‌కు రిజ‌ర్వు అయ్యింది.

దాంతో బట్టు లీలాకనకదుర్గ సర్పంచి పోటికి దిగింది. అప్పటికే ఆమె 9నెలల గర్భిణి. అయినా కానీ ప‌ట్టు వీడ‌కుండా ఎన్నికల ప్ర‌చారంలో పాల్గొంది. ప్ర‌చారంలో పాల్గొన‌డ‌మే కాదు.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ ప్రచారం చేసింది. ఇక సరిగ్గా పోలింగ్‌ రోజు ఓటు వేసిన వెంట‌నే.. పురిటి నొప్పులు వ‌చ్చాయి. దాంతో కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్క‌డ బంగారంలాంటి ఆడ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అదే రాత్రి విడుద‌ల చేసిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 689 ఓట్ల మెజార్టీతో లీలా కనకదుర్గ విజయం సాధించారు. దీన్ని చూసిన ప‌లువురు నీ కూతురే.. నీకు ఈ విజ‌యాన్ని సంపాదించి పెట్టింద‌ని అంటున్నారు.

అల్లు అర్జున్ కు పోటీగా మంచు మ‌నోజ్ !

గుండెల్ని పిండేలా చైతూ సాయిప‌ల్ల‌వి ల‌వ్ స్టోరీ సాంగ్

అఖిల్‌కు పూజా హెగ్దే విసిరిన గులాబి బాణం చూశారా?

ప్రేమికుల రోజు కథేంటో తెలుసా? ఫిబ్ర‌వ‌రి 14 నే ఎందుకు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -