ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 69వ జన్మదినాన్ని (ఏప్రిల్ 20) పురస్కరించుకుని ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత జగన్, ప్రధాని మోది శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. చంద్రబాబునాయుడికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఈ ఉదయం 8.26కు జగన్ ట్వీట్ పెట్టగా, అది నిమిషాల్లో వైరల్ అయింది. నెటిజన్లు, ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు వినూత్నంగా రియాక్ట్ అవుతున్నారు.
కాబోయే సీఎం, మాజీ కాబోతున్న సీఎంకు అభినందనలు చెప్పారని, శత్రువైనా దగ్గరకు తీసుకునే మనస్తత్వం జగన్ దని, జగన్ ది చాలా పెద్ద మనసు అని, చంద్రబాబు జగన్ నుంచి శుభాకాంక్షలు ఊహించి వుండరని రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ప్రధాని మోదీ.. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు.. ఆయన ఆయురారోగ్యాలతో చిరకాలం ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.