Thursday, May 16, 2024
- Advertisement -

రెండు రోజుల్లో యాభై వేల కోట్ల అవినీతి

- Advertisement -

కొన్ని సార్లు ఆరోపణలు శృతి మించుతాయి విన్నవారికి నవ్వుకునేలా అనిపిస్తాయి. అమరావతి శంకుస్థాపన మహోత్సవం కి సంబంధించి ప్రతిపక్షాలు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నాయి. భారీ అవినీతి ఈ శంకుస్థాపన విషయం లో జరిగింది అని అది కూడా తాను ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తాను రాలేకపోవడానికి ఒక కారణం అంటూ జగన్ చెప్పడం గమనార్హం. అయితే ఆ అవినీతి ని ప్రస్తావిస్తూ జగన్ మేన మామ రవీంద్ర నాథ్ రెడ్డి వింత కామెంట్ లు చేసారు. 

రాజకీయ నేతలు వ్యాఖ్యలు కాస్త లాజికల్ గా ఉంటె బాగుంటుంది.

కానీ రవీంద్ర నాథ్ రెడ్డి వ్యాఖ్యలు చాలా కామెడీ గా ఉన్నాయి అంటున్నారు జనాలు. అమరావతి పేరుతో చంద్రబాబు ఒక మాయాబజార్ నిర్మిస్తున్నారు అని ఆయన మండి పడ్డారు, ఏపీ కి ప్రత్యేక హోదా విషయం లో కడప కలక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు ఆయన ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ రాజధాని పేరు తో ఒకటిన్నర లక్షల కోట్ల కుంభకోణం జరుగింది అని చెబుతున్నారు ఆయన. 

జగన్ రెండు రోజుల క్రితమే లక్ష కోట్ల కుంభకోణం అని చెప్పగా దాన్ని ఈయన లక్షా యాభై వేల కోట్ల కి పెంచేశారు. అంటే కేవలం రెండు రోజుల్లో అవినీతి యాభై వేల కోట్లకి పెరిగిపోయింది అన్నమాట .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -