Monday, April 29, 2024
- Advertisement -

టీడీపీలో ఒక గ్రూపు బైబై బాబు అంటున్నారు…..

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై వైసీపీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పార్టీలో బాబుపై నాయ‌కుల‌కు న‌మ్మ‌కం స‌న్న‌గిల్లుతోంద‌న్నారు. పార్టీలో ముస‌లం మొద‌ల‌య్యింద‌ని….ఒక వ‌ర్గం బైబై బాబు అంటున్నార‌ని ఎద్దేవ చేశారు. బాబుకు ప్ర‌జ‌ల‌పై న‌మ్మ‌కం లేద‌న్నారు. లోకల్‌ బాడీ ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ ఉండదనే భయాందోళనతో టీడీపీ నేతలు ఈవీఎంలపై నెపం నెడుతున్నారని వ్యాఖ్యానించారు.

కేసుల నుంచి తప్పించుకోవడం కోసం రకరకాల విన్యాసాలు చేస్తున్నారని ఆరోపించారు. ‘సీఎస్ మనవాడు అయితే మంచివాడు.. కాకపోతే పనికిరాడు’ అనే రీతిలో బాబు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాంబ్లింగ్ చేసే ఒక సంస్థ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చంద్రబాబు అంటున్నారని మండిపడ్డారు. సీఎం నోటి వెంట మట్కాలు, బెట్టింగులు అన్న మాట రావడం ఏంటని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇలా మాట్లాడుతున్న బాబు రాజ‌కీయాల‌కు అన‌ర్హుడ‌ని విమ‌ర్శించారు.

డీజీపీ ఠాకూర్‌పై వైసీపీ అనేక ఫిర్యాదులు చేసినా బదిలీ చేయలేదన్నారు. చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చారని, ఎన్నికలకు ముందు ఈవీఎంలు వద్దని, టీడీపీ ఎందుకు చెప్పలేదంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు వెన్నుపోటు రాజకీయాలు బాగా తెలుసునన్నారు. డీజీపీ బదిలీపై తాము ఈసీకి ఫిర్యాదు చేశామని.. మరి ఆ విషయంపై ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడరన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -