Tuesday, May 7, 2024
- Advertisement -

ఏపీ డీజీపీ ఠాకూర్‌పై రూ. 30 కోట్ల బాంబు పేల్చిన విజ‌య‌సాయిరెడ్డి..

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌న‌లు చేశారు. ష్ట్ర డీజీపీ హోదాలో ఉన్న ఠాకూర్ తన కాన్వాయ్ లో రూ.35 కోట్లు రాజధాని అమరావతి నుంచి ప్రకాశం జిల్లాకు తరలించారని, ఇది మార్చి 24న జరిగిందని విజయసాయి తెలిపారు. ఆర్పీ ఠాకూర్ వాహానాన్ని తనిఖీ చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందన్నారు.

తాము డీజీపీపై చేసిన ఆరోపణలను రుజువు చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. తాము చేసిన ఆరోపణలు తప్పైతే కేసు పెట్టాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘంతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలోని బృందం సమావేశమైంది. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను తొలగించాలని ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -