Tuesday, May 14, 2024
- Advertisement -

క‌ర్నూలు జిల్లాలో కాంగ్రెస్‌కి షాక్…

- Advertisement -

ఎన్నికలు సమీపిస్తున్న స‌మ‌యంలో నేతలు త‌మ భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకొని ఎవ‌రి దారి వారు చూసుకుంటున్నారు. సాదార‌నంగా ప్ర‌తిప‌క్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి వ‌ల‌స‌లు ఉంటాయి…కానీ ఏపీలో మాత్రం విచిత్రంగా అధికార పార్టీనుంచి వ‌ల‌స‌లు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ , కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంట‌న్న నేప‌ధ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేత‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.

తెలంగాణాలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుకొని ఘోరంగా ఓట‌మి పాల‌య్యింది టీడీపీ. అయినా కూడా ఏపీలో పొత్తు ఉంటుంద‌ని ఇప్ప‌టికే సంకేతాలు పంప‌డంతో …పొత్తు ఇష్టంలేని నాయ‌కులు వేరే పార్టీల‌ను చూసుకుంటున్నారు. ఎన్నిక‌లు ఎంతో దూరం లేకపోవ‌డంతో నేత‌లు త‌మ భ‌విష్య‌త్తుపై సుమాలోచ‌న చేస్తున్నారు. పొత్తును తీవ్రంగా వ్య‌తిరేకించి ఏఐసీసీ కార్య‌ద‌ర్శి ర‌విచంద్రా రెడ్డి కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు తాజాగా మ‌రో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అమె భ‌ర్త ప్యాన్ గూటికి చేరేందుకు సిద్ద‌మ‌య్యారు. 2009లో అలూరునుంచి కాంగ్రెస్ పార్టీ త‌రుపునుంచి నీర‌జా రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ఆమెభ‌ర్త సురేష్‌రెడ్డి1994లో ప‌త్తికొండ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ఇప్ప‌టికే జ‌గ‌న్‌ను క‌ల‌సి త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై చ‌ర్చించారంట‌. జ‌గ‌న్ కూడా వారి చేరిక‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో కండువా క‌ప్పుకొవ‌డమే త‌రువాయి. ఇచ్చాపురంలో ఈనెల 9ప భారీ బ‌హిరంగ స‌భ‌తో జ‌గ‌న్ పాద‌యాత్ర ముగుస్తుంది. అదే రోజు నే పార్టీలో చేర‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -