Wednesday, April 24, 2024
- Advertisement -

ప‌వ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి బ్రేక్‌…

- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి బ్రేక్ ప‌డింది. శ్రీకాకుళంలో ఈ రోజు ప‌వ‌న్ నిర్వ‌హించ‌నున్న ప్ర‌చారానికి పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. ఈ రోజె చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో బ‌ద్ర‌తా చ‌ర్య‌ల్లో భాగంగా ప‌వ‌న్ టూర్‌కు అనుమ‌తి ఇవ్వ‌లేమ‌ని శ్రీకాకుళం జిల్లా పోలీసులు చెప్పారు. శ్రీకాకుళానికి హెలికాఫ్టర్ లో లేదా రోడ్డు మార్గంలో పవన్ వెళ్లేందుకు పోలీస్ ఉన్నతాధికారుల నుంచి అనుమతివ్వలేదు.

ప‌వ‌న్ జిల్లాలోని సోంపేట, పలాస, కాశీబుగ్గ, టెక్కలి, పాతపట్నం ప్రాంతాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించాల్సి ఉంది. చంద్రబాబు ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చాపురం, నరసన్నపేట, రాజాం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దీంతో ప‌వ‌న్ ప్ర‌చారానికి దెబ్బ ప‌డింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -