మండుతున్న ఎండలతో ఎన్నికల ప్రచారంలో నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. ఓట్లరు కరుణించాలంటె పోటీ చేస్తున్న అభ్యర్ధులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాల్సిందే.అందుకే ఎండను కూడా లెక్క చేయకుండా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారానికి వెళుతున్న నేతలకు వడదెబ్బ తగులుతోంది. తాజాగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు.
కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారానికి వెళ్లారు. దీంతో ఆమె మళ్లీ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల నుంచి విశ్రాంతి తీసుకుంటున్న అఖిలప్రియ.. ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. మంత్రికి వైద్యులు ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం కుదట పడగానే తిరిగి ప్రచారంలో పాల్గొంటారని మంత్రి అఖిల సన్నిహిత వర్గాలనుంచి సమాచారం.