Wednesday, May 15, 2024
- Advertisement -

కోవ‌ర్టుల‌తో బెంబేలెత్తిపోతున్న చంద్ర‌బాబు…

- Advertisement -

ఏపీసీఎం చంద్ర‌బాబునాయుడికి రోజు రోజుకీ అభ‌ద్ర‌తా భావం పెరిగిపోతోంది. పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేల‌మీద బాబుకు నియంత్ర‌ణ లేకుండా పోతోంది. పార్టీలో ఎవ‌రిని న‌మ్మాలో ఎవ‌రిని న‌మ్మ‌కూడాదో అర్థంకాని ప‌రిస్థితితో చంద్ర‌బాబు కొట్టుమిట్టాడుతున్నాడు . తాజాగా బాబుకు పార్టీలో కోవ‌ర్టుల భ‌యం ప‌ట్టుకుంది.

అస‌లు విషయానికి వ‌స్తే మంత్రి వ‌ర్గంలో జ‌న‌సేనుడి ప‌వ‌న్ కోవ‌ర్టులున్నారా అనే భ‌యం బాబును వెంటాడుతోంది. ఇదే ఇప్పుడు అమ‌రావ‌తిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనికి కార‌నం లేక‌పోలేదు. గ‌తంలో టీడీపీనుంచి 40 ఎమ్మెల్యేలు జ‌న‌సేన పార్టీతో ట‌చ్‌లో ఉన్నార‌ని ఆ పార్టీ నాయ‌కులే స్వ‌యంగా వెల్ల‌డించారు.

బాబు ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన రెండు అఖిల ప‌క్ష స‌మావేశాల‌కు ప్ర‌ధాన‌పార్టీలు హ‌జ‌రుకాకుండా డుమ్మాకొట్టిన సంగ‌తి తెలిసిందే. దీంతో కొందరు మంత్రులు, ఎంఎల్ఏల వైఖరిపై చంద్రబాబు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారట. ఇదే విష‌యాన్ని పలువురు మంత్రులు, ఐఏఎస్ అధికారుల వద్ద చంద్రబాబు ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారంట‌.

తమ మంత్రుల్లో కొందరు రెగ్యలర్ గా పవన్ తో టచ్ లో ఉన్నారని చంద్రబాబు అన్నారట. పతన్ తో మంత్రులు, ఎంఎల్ఏలు టచ్ లోనే ఉన్నా మన అవసరాలకు మాత్రం పవన్ రప్పించలేకపోతున్నారంటూ మండిపడ్డారట చంద్రబాబు.

ప్రభుత్వంలో జరుగుతున్న భారీ అవినీతిని ప్రత్యేకించి లోకేష్ అవినీతికి సంబంధించి వివరాలు తనకు వారే ఇచ్చినట్లు పవన్ చేసిన ప్రకటన పెద్ద దుమారాన్నే రేపింది. బ‌హూశ అందుకే నేమో బాబు అభ‌ద్ర‌తా భావంలో ఉన్నార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -