- Advertisement -
దావోస్ వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్కు కోర్టు అనుమతి లభించింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో 52వ ప్రపంచ వాణిజ్య సదస్సు మే 22 నుంచి ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన నేతలు హాజరవుతారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 19 నుంచి 31 మధ్య దావోస్ వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేశారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతు సడలించాలని కోరారు. సీఎం హోదాలో అధికారిక పర్యటనకు వెళుతున్నట్లు తెలిపారు.
అయితే జగన్ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సీఎం జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చింది.
కొత్త వాహనం కొంటున్నారా ? అయితే ఇది తెలుసుకోండి.