తెలంగాణా టీడీపీ నేత రేవంత్ రెడ్డి పార్టీపదవులు, ఎమ్మెల్యేపదవికి రాజీనామ చేయకుముందు ఏపీ మంత్రులపై సంచలన కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాఫిక్ గా మారాయి. ఇప్పటికె రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు. అయితె ఇప్పుడు తొలిసారిగా ఏపీ ఆర్థిక మంత్రి యనుమల రామకృష్ణుడు స్పందించారు.
తెలంగాణలో తనకు ఎటువంటి కాంట్రాక్టులు ఉన్నా, రేవంత్ రెడ్డి వాటిని ఒక్క రూపాయి తనకు ఇవ్వకుండా తీసుకోవచ్చని, ఒకవేళ, కాంట్రాక్టులపై కమిషన్ వచ్చినా తీసుకోవచ్చని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కాంట్రాక్టులను పొందారని ఏపీ అర్థికమంత్రి యనమలపై రేవంత్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
తెలుగుదేశం పార్టీని విడిచి బయటకు వెళ్లడానికి నిర్ణయించుకున్న తరువాతే రేవంత్ ఇటువంటి ఆరోపణలు చేసినట్టు తాను భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఢిల్లీకి వెళ్లిన రేవంత్, రాహుల్ గాంధీని కలిసి వచ్చిన తరువాత ఏపీ టీడీపీ నేతలపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. యనమల, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ వంటి వాళ్లు కేసీఆర్ నుంచి కాంట్రాక్టులు పొందారని ఆరోపించారు. ఇప్పటికె పరిటాలశ్రీరామ్, పయ్యావుల కేశవ్ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.