Sunday, May 5, 2024
- Advertisement -

లోకేష్ క్యారెక్టర్ ఇదీ……. ఇంకా జేజేలు కొడతారా?

- Advertisement -

పచ్చ మీడియా జనాలందరూ కూడా వైఎస్ జగన్ వ్యక్తిత్వం గురించి ఏ స్థాయిలో దుష్ర్పచారం చేశారో చెప్పనవసరం లేదు. బూట్లతో దేవుడి పూజలు చేసినా సరే……చంద్రబాబు గొప్పోడు. దుర్గమ్మ, తిరుమల దేవస్థానాలను ఎంతలా అప్రతిష్టపాలు చేసినా గొప్పొడే. అదే జగన్ తిరుమల గురించి మంచి మాటలు చెప్పినా ముద్దాయే. అదీ పచ్చ మీడియాతో పాటు టిడిపి జనాల తీరు. ఇక జగన్‌ని ఎలా పెంచాలో కూడా చంద్రబాబు ఓ స్థాయిలో నీతి సూక్తులు చెప్పారు. లోకేష్‌ని అద్భుతంగా పెంచానని తన డబ్బా తానే కొట్టుకున్నాడు.

అయితే లోకేష్ వ్యక్తిత్వం ఏపాటిదో ఆ మధ్య అమ్మాయిలతో మందు పార్టీలు, రచ్చ రచ్చ ఫొటోలతో తానే చెప్పేసుకున్నాడు లోకేష్. ఇంకా అలాంటి ఫొటోలు తన దగ్గర ఎన్నో ఉన్నాయని ఆయనే గొప్పగా చెప్పుకున్నాడు కూడా. తాజాగా జాతీయ జెండాను ఎగరేయడానికి కూడా బద్ధకించాడు లోకేష్. పచ్చ మీడియాకు ఇంటర్యూ ఇచ్చినప్పుడు లోకేష్ తన గురించి తానే తానో పెద్ద తిండి పిచ్చోడినని చెప్పుకున్నాడు. తన బద్ధకం గురించి కూడా గొప్పగా చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆ బద్ధకం ఎలా ఉంటుందో జాతీయ జెండా వందనం కార్యక్రమంలో ససాక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియచెప్పాడు. ఇక వాజ్‌పేయికి నివాళులు అర్పించే విషయంలోనూ తన చిన్నతనాన్ని తానే చూపించుకున్నాడు లోకేష్. వాజపేయి గొప్పదనం గురించి చెప్పాల్సింది పోయి చంద్రబాబు గొప్పదనం గురించి చెప్పి అడ్డంగా బుక్కయ్యాడు. ఒక జాతిరత్నం దివికేగిన వేళ అందరూ కూడా ఆయన గొప్పదనం గురించి కొనియాడుతూ ఉంటే లోకేష్‌కి మాత్రం అందులో కూడా ‘నాన్నారి’ గొప్పదనం గురించి చెప్పాలన్న లేకి ఆలోచన ఎలా వచ్చిందో ఆయనే చెప్పాలి.

వరుసగా జరిగిన ఈ సంఘటనలే లోకేష్ వ్యక్తిత్వం ఏంటో తెలియచేయడం లేదా? ఇక లోకేష్ అవినీతి గురించి నాయకుల నుంచీ సామాన్యుల వరకూ ఓ స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. అయినప్పటికీ పచ్చ మీడియా జనాలు మాత్రం ఆంధ్రప్రదేశ్‌ని ఉద్ధరించే భావి నాయకుడు లోకేషే అని జనాలను నమ్మించడానికి శతథా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు విషయంలో సక్సెస్ అయినట్టుగానే లోకేష్ విషయంలో కూడా పచ్చ బ్యాచ్ జనాలు సక్సెస్ అవుతారా? సోషల్ మీడియా యుగంలోనూ జనాలను మాయచేయగలరా? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -