రమణ దీక్షితులను జైల్లో పెడితే అన్ని నిజాలు బయటకు వస్తాయంటూ ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. ప్రతిపక్షాలు, బ్రాహ్మణ సంఘాల నుంచి వస్తున్న విమర్శల దెబ్బకు దిగొచ్చారు. రమణదీక్షితులపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు.
రమణదీక్షితులు గారిని ఉద్దేశించి అన్న మాటలకు క్షమాపణలు చెబుతున్నాను. బ్రాహ్మణుల ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. అందుకే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. నిజానికి నేను ప్రతిపక్షం వారిని విమర్శించాలనుకుని రమణదీక్షితులును అనేశాను. అయినా, ముఖ్యమంత్రి ఇంట్లో శ్రీవారి నగలు ఉన్నాయని ఎవరైనా ఆరోపిస్తే.. తెలంగాణలో అయితే ఖచ్చితంగా బొక్కలోవేసి ఇంటరాగేషన్ చేసేవారన్నారు.
సీఎం ఇంట్లో శ్రీవారి నగలు ఉన్నాయన్న సాయిరెడ్డి వ్యాఖ్యలు తనకు ఆగ్రహం తెప్పించాయని, ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, బ్రాహ్మణుల ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని కోరుకునే వ్యక్తిని తానని అన్నారు. తీవ్ర ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డిని మరో రాష్ట్రంలో అయితే లోపల వేసేవాళ్లని అన్నారు.