Friday, April 26, 2024
- Advertisement -

సీఎం జగన్ ని కలిసిన ఏపీ నూత‌న సీఎస్‌గా ఆదిత్య‌నాథ్ దాస్‌!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్ నియ‌మితుల‌య్యారు. ప్రస్తుత ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం సాహ్నీ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుండటంతో.. ఆమె స్థానంలో ఆదిత్యనాథ్‌ దాస్‌ను ప్రభుత్వం నియమించింది.  పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు.

ప్రభుత్వం ప్రధాన కార్యదర్శితో పాటు మరికొన్ని స్థానాల్లో స్వల్ప మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ కార్యదర్శిగా శ్యామలరావు, పురపాలకశాఖ కార్యదర్శిగా వై.శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను నియమిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలిచ్చింది.

కాగా, ఏపీకి కొత్తగా నియామకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌ సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో కలిసి క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన ఆయన.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -