Thursday, April 25, 2024
- Advertisement -

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు చేదు అనుభవం.. వాహనంపై కోడిగుడ్లతో దాడి!

- Advertisement -

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వాహనంపై దాడి జరిగింది. కొందరు కోడిగుడ్లతో ఆయన వాహనంపై దాడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. తాళ్లరాంపూర్ గ్రామంలో జరుగుతున్న ఓ నిరసన కార్యక్రమానికి అరవింద్ వచ్చిన వేళ ఈ ఘటన జరిగింది. ఆయన వాహనాన్ని కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోగా, వారిని నిలువరించేందుకు బీజేపీకి చెందిన కొందరు ప్రయత్నించారు. నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌ సహకార సంఘం ఎదుట నిర్వహించ తలపెట్టిన ధర్నాలో పాల్గొనడానికి అర్వింద్‌ సోమవారం గ్రామానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులు, కొందరు టీఆర్ఎస్ నేతలు.. పసుపు బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించారు. ఎంపీ.. రైతులతో మాట్లాడడానికి ప్రయత్నిచినా ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో టీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్, ఎంపీ వాహనంపైకి కోడిగుడ్లను విసరడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో స్థానిక బీజేపీ నేత ఒకరికి గాయాలు కాగా, అతన్ని ఆసుపత్రికి తరలించారు.

ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ తన చెప్పుతో సమానమని అర్వింద్‌ మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రానికి పెద్ద కచిరెగాడని, బైంసాలో ముస్లింలతోపాటు హిందువులపై కూడా అక్రమంగా కేసులు నమోదు చేయించారని ఆరోపించారు.

కరోనా వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేయాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

మడమశూల (పాదాల వాపు) నొప్పినివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

నేటి పంచాంగం,మంగళవారం(29-06-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -