Sunday, May 12, 2024
- Advertisement -

నిగురు క‌ప్పిన నిప్పులా ఉన్న ఫ్యాక్స‌న్‌.. కేసు న‌మోదు

- Advertisement -

బైపోల్ ముగిసిన తర్వాత టీడీపీ-వైసీపీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటుండం నంద్యాలలో హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఎన్నికల దాకా ప్రశాంతంగా కొనసాగిన వాతావరణం.. ఒక్కసారిగా అదుపు తప్పుతున్న సూచనలు కనిపిస్తుండటంతో టెన్స‌న్ వాతావ‌ర‌నం నెల‌కొంది.

అయితే ఇద్ద‌రు ఎవ‌రి కోనంలో వాల్లు వ్యాఖ్యానించారు. టీడీపీకి చెందిన అభిరుచి మధు కత్తితో హల్‌చల్ చేస్తూ తమపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని శిల్పా చక్రపాణిరెడ్డి ఆరోపించారు. మధు ఓ రౌడీ షీటర్ అని ఆరోపించారు. నంద్యాలలో ప్రతీ ఒక్కరిపై రౌడీ షీట్ ఓపెన్ చేయించడం శిల్పా సోదరులకు అలవాటని, చివరకు గుళ్లోని పూజారులపై కూడా రౌడీ షీట్ తెరిపించేంత ఘనత వారిదని మధు ఎద్దేవా చేశారు.

ఈ ఘ‌ట‌న‌పై టీడీపీ నేత మ‌ధు నంద్యాల టూ టౌన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న కారు వ‌ద్ద‌కు వ‌చ్చి వైసీపీ నేత‌లు జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, శిల్పా అనుచ‌రుడు ఆదిరెడ్డి స‌హా ప‌లువురు దాడికి దిగారని మ‌ధు చేసిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు వారిపై కేసు న‌మోదు చేశారు. త‌న‌పై వారు హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డార‌ని మ‌ధు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ ఘ‌ట‌న‌లో శిల్పా చ‌క్ర‌పాణి స‌హా 8 మందిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -