Friday, May 10, 2024
- Advertisement -

ఇదేంటి చంద్రబాబు.. జగన్ను కాపీ కొట్టడమా?

- Advertisement -

ఏపీలో తెలుగుదేశం మరియు వైసీపీ ల మద్య ఏ స్థాయిలో రాజకీయ వివాదం కొనసాగుతుందో అందరికీ తెలిసిందే. ఏపీలోని రాజకీయాలు ప్రధానంగా రెండు పార్టీల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఈ రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరి విధానాలను ఒకరు తీవ్రంగా తప్పుబట్టడం షరామామూలే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడూ ప్రవేశ పెట్టిన చాలా వాటిని వైఎస్ జగన్ మార్చిన సంగతి తెలిసిందే. అలాగే తాము అధికరంలోకి వస్తే వైసీపీ ప్రవేశ పెట్టిన వాటిని కచ్చితంగా మరుస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ విధంగా ఒకరి విధానాలను మరొకరు సమర్థించలేనంతా రాజకీయ వైరం ఈ రెండు పార్టీల మద్య ఉంది. .

అయితే ఒక్క విషయంలో మాత్రం జగన్ను ఫాలో అవుతున్నారు చంద్రబాబు. అది ఏపీలో కాదండోయ్ తెలంగాణలో. తెలంగాణలో టీడీపీకి పునర్జీవం పోసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీడీపీ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసిన బాబు.. ఇక వచ్చే ఎన్నికల వరకు టీడీపీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ” ఇంటింటికి తెలుగుదేశం ” కార్యక్రమాన్ని చేపడుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెల్లే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ విషయాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రతి గ్రామ గ్రామన తెగులుదేశం జెండాను ఎగురవేసేందుకు ” ఇంటింటికి తెలుగుదేశం ” అనే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో బస్సు యాత్ర కూడా చేపట్టబోతున్నామని, వచ్చే ఎన్నికల వరకు ఇది కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. కాగా ఏపీలో వైఎస్ జగన్ ” ఇంటింటికి మన ప్రభుత్వం ” పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా జగన్ ప్రభుత్వానికి ఎంతవరకు లబ్ధి చేకూరిందో తెలియదు గాని, ఇదే కార్యక్రమాన్ని కాస్త పేరు మార్చి తెలంగాణలో ప్రవేశ పెట్టబోతున్నారు చంద్రబాబు. మరి నిత్యం జగన్ పై విరుచుకుపడే చంద్రబాబు.. జగన్ విధానాలను అనుసరించడం నిజంగా ఆశ్చర్యమనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

ఒట్టేసి చెబుతున్నా.. అండగా ఉంటా !

కాంగ్రెస్ కే ఎందుకు ఈ అగ్ని పరీక్ష!

జగన్ వారిపై అసహనంగా ఉన్నారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -