Monday, April 29, 2024
- Advertisement -

బాబుపై కుట్ర కాదు….. జగన్‌ని పతనం చేయడానికి ప్రజలను బలిపెట్టే బాబు కుట్ర

- Advertisement -

ఓటుకు కోట్లు కేసులో తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు….. ఆ మొత్తం వ్యవహారాన్ని కెసీఆర్ తనపై పన్నిన కుట్రగా ప్రజలను నమ్మించాలని చూశాడు. మొత్తం సీమాంధ్ర జనాలను కేసీఆర్ అవమానించాడు అనే స్థాయిలో రంకెలేశాడు. ఇప్పుడు కూడా బాబు చేసిన తప్పులు, అవినీతి వ్యవహారాల గురించి కేంద్రం ఎక్కడ ప్రశ్నిస్తుందో, న్యాయ వ్యవస్థ ఎక్కడ తనను దోషిగా నిలబెడుతుందో అన్న భయంతో ముందుగానే తనను పతనం చేయడానికి కుట్ర జరుగుతోందని గావు కేకలు స్టార్ట్ చేశాడు బాబు. రేపు తన తప్పులు, అక్రమాలు, అవినీతి వ్యవహారాల్లో అడ్డంగా ఇరుక్కుపోయినా కూడా ఆ మొత్తం వ్యవహారాన్ని కుట్రగా అభివర్ణించి……. ప్రజలను నమ్మించి సానుభూతి కొట్టేయాలన్నది బాబు ప్లాన్. అదేంటో మరి రాష్ట్ర విభజన సమయం నుంచీ ప్రతి విషయాన్ని కూడా తనను దెబ్బ కొట్టడానికి తీసుకుంటున్న నిర్ణయంగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు. తీరా చూస్తే ఆ నిర్ణయాల విషయంలో తన స్టాండ్ ఏంటో తేల్చి చెప్పలేని దౌర్భాగ్య స్థితి చంద్రబాబుది.

ఆ విషయం పక్కన పెడితే 2019ఎన్నికల్లో గెలవడానికి ఎన్నిరకాల వ్యూహాలు, కుట్రలు రచించాలో అన్నీ చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు జగన్‌ని పతనం చేయడానికి మరో కుట్ర పన్నాడని చెప్పి పోలీసు వర్గాలే చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతం జగన్ పాదయాత్ర గుంటూరు-కృష్ణా జిల్లాల్లో జరుగుతోంది. టిడిపి క్యాడర్ చాలా యాక్టివ్‌గా ఉండే జిల్లాలు ఇవి. అలాంటి ప్రాంతంలో కూడా జగన్ పాదయాత్రకు వేలల్లో, లక్షల్లో జనాలు తరలి వస్తున్నారు. ప్రతి పక్ష నాయకుడు కూడా అయిన జగన్‌కి పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానిదే. అయితే చంద్రబాబు మాత్రం జగన్ సంకల్పయాత్రకు సెక్యూరిటీ విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. జగన్ పాదయాత్రలో అలజడులు చెలరేగి జన నష్టం జరిగితే ఆ పేరు చెప్పి జగన్ యాత్రను ఆపెయ్యొచ్చు. ఒకవేళ జగన్‌కే ఏమైనా జరిగినా సంతోష పడేలాగే కనిపిస్తున్నారు టిడిపి జనాలు. ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. బిజెపి తనపై కుట్ర పన్నుతోందని చెప్పి శివాజీలాంటి టైం పాస్ కామెడీ యాక్టివిస్ట్స్ చేత డ్రామా స్టంట్స్ చేయిస్తూ గగ్గోలు పెడుతున్నాడు చంద్రబాబు. అంతకుముందు సుజనా చౌదరి ఛానల్ మహా టీవీలో కూడా ఇదే సొల్లు వినిపించారు. అది వర్కవుట్ కాలేదని అదే సొల్లు పురాణాన్ని శివాజీ చేత వినిపించారు. కానీ జనాలు మాత్రం ఒక్క శాతం కూడా నమ్మలేదు. అయితే జగన్‌ని పతనం చేయడానికి చంద్రబాబు పన్నుతున్న కుట్రల గురించి మాత్రం ప్రజలు బాగానే చర్చించుకుంటున్నారు. జగన్ సంకల్ప యాత్రకు వస్తున్న జనాలు, సెక్యూరిటీ సిబ్బంది అస్సలు లేకుండా పోతున్న వైనాలు జనం కళ్ళకు కడుతున్నాయి. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, నిప్పు అనుకునే చంద్రబాబు ఎన్నికలొచ్చిన ప్రతిసారీ దొడ్డిదారిలో గెలవాలనుకునే ఇలాంటి ప్రయత్నాలను ప్రజలు ఈసడించుకున్నారన్నది మాత్రం నిజం. అయితే అక్కడున్నది మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు……. ఆయనకు ఇలాంటివి అస్సలు పట్టవు……. అధికారం దక్కిందా ? లేదా? అన్నదే ముఖ్యం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -