కోటి వృక్షార్చనలో పాల్గొందాం.. ముఖ్యమంత్రి కేసీఆర్కు హరిత కానుక ఇద్దామని ప్రముఖ సినీ నటి, ఏపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజుకి హరితహారం ఏర్పాటు చేయాలని.. తెలంగాణలో కోటి మొక్కలు నాటి పచ్చదనాన్ని నిండుగా తీకు వచ్చే ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. దీనిపై స్పందించిన రోజా ఈ మేరకు తన ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
ఈనెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటుదామన్నారు.
కేసీఆర్కు హరిత కానుకగా ఇద్దామని.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు. పచ్చదనం-పరిశుభ్రతతో కాలుష్య రహిత తెలుగు రాష్ట్రాలకు ఇది మార్గం సుగమం చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
మోనాల్, అఖిల్ ఆన్స్క్రీన్ రొమాన్స్ మొదలైంది !
తెరదించిన బిజేపి.. అభ్యర్థుల ప్రకటన..!
నిధి అగర్వాల్ ఫ్యాన్స్ మాములుగా లేరు… ఏకంగా అదే చేశారుగా.. !