పార్టీ విధానాలు నచ్చే తాను కాంగ్రెస్ లో చేరానని నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పంటల పెట్టుబడికి రుణాలు మంజూరు చేస్తామని, ఏక కాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు.
కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చి రాహుల్ ప్రధాని అయితే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదాపైనే అని చెప్పారని తెలిపారు. మరో వైపు జగన్పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తాను పోటీ చేస్తానని మాజీ శాసనసభ్యుడు, కాంగ్రెసు నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను అందుకు సిద్ధమన్నారు.
త్వరలో శ్రీశైలం నుంచి కాంగ్రెస్ బస్సుయాత్ర ప్రారంభిస్తామని బైరెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ, పంటలకు పెట్టుబడికి రుణం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ విధానాలు నచ్చే తాను కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు. బీజేపీ పాలనలో దేశ ప్రజలంతా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని… రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమి, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.