Sunday, April 28, 2024
- Advertisement -

రజనీ పార్టీ చిహ్నంగా సైకిల్‌ గుర్తు

- Advertisement -

గత పాతికేళ్లుగా రాజకీయాల్లో వస్తా వస్తా అంటూ ఊరిస్తూ వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్.. డిసెంబర్ 3న కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు డిసెంబర్ 31న అర్ధరాత్రి ఈ రాజకీయ పార్టీకి సంబంధించిన విధి విధానాలను ప్రకటించబోతున్నట్టు వెల్లడించారు. సమయం దగ్గరపడుతుండటంతో రజనీ ప్రస్తుతం పార్టీ గుర్తు, జెండాపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా, తనకు అత్యంత సన్నిహితులైన అర్జున్ మూర్తి, తమిళ రవి మణియన్ లు సహా, మక్కల్ మండ్రం జిల్లా కార్యదర్శలతో భేటీ అయి, గంటల పాటు సమావేశం జరిపిన ఆయన, ప్రజలను ఆకట్టుకునేలా గుర్తు, జెండా ఉండాలని నిర్ణయించారు.

నియోజకవర్గాలవారీగా అభ్యర్థుల ను ఎంపిక చేయడం, ఏయే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే విషయాలపై రజనీ మండ్రం నేత లతో సమగ్రంగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో గురువారం మళ్ళీ మక్కల్‌మండ్రం నేతలతో ఎలాంటి హాడావుడి లేకుండా రజనీ సమావేశమయ్యారు. గురువారం నాటి సమావేశం సమాచా రాన్ని ప్రసారమాధ్యమాలకు తెలుపకపోవడం గమనార్హం. ఈ సమావేశంలో పార్టీ పతాక రూపకల్పన, చిహ్నం ఎంపికపై ఆయన చర్చించారు. పార్టీ పేరును అత్యంత రహ్యంగా ఉంచేందుకు నిర్ణయించినా, చిహ్నం, జెండా విషయంగా లీకులు బయటకు వచ్చాయి. ప్రజల్ని ఆకర్షించే రీతిలో మూడు వర్ణాలతో రజనీ పార్టీ జెండా రూపుదిద్దుకోబోతోంది. ఆయా వర్ణాలతో జెండా రూపురేఖల నమూనా సిద్ధం చేసి, రజనీ వద్దకు తీసుకెళ్లేందుకు సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం.

ఇక పార్టీ చిహ్నంగా సైకిల్ ను ఎంచుకోవాలని సమావేశంలో పాల్గొన్న వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. రజనీ నటించిన అన్నామలై చిత్రంలో పాలవాడిగా సైకిల్‌పై పాడే పాటను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవడం ప్లస్‌పాయింట్‌ అవుతుందని కూడా తెలిపారు. అంతేకాకుండా గతంలో సైకిల్‌ గుర్తుపై పోటీ చేసిన తమిళ మానిల కాంగ్రెస్‌ డీఎంకేతో పొత్తుపెట్టుకుని గెలిచిన విషయాన్ని మరువకూడదన్నారు. రెండు వారాల్లోగా పార్టీ గుర్తును ఎంపిక చేస్తానని రజనీ వారికి హామీ ఇచ్చారు. మక్కల్‌ మండ్రం నిర్వాహకులు జెండా, చిహ్నం విషయంగా తమ అంగీకారం తెలిపినా, తుది నిర్ణయం రజనీకాంత్‌ తీసుకోవాల్సి ఉందని ఆ మండ్రం నిర్వాహకులు పేర్కొంటున్నారు.

రజనీ ప్రస్తుతం శివ దర్శకత్వం వహిస్తున్న ‘అన్నాత్తే’ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ కోసం ఆయన ఈనెల 14న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన కుష్బూ, మీనా నటిస్తున్నారు. కీర్తి సురేష్ రజినీకాంత్ కూతురు పాత్రలో నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -