ఏపీలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ను ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకే ఇచ్చారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టత ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో రెండో విడత అమ్మఒడిని ప్రారంభించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.
ఈ పథకం కింద రూ.6,161 కోట్లను జమ చేస్తామని తెలిపారు. ఈ నెల 11న ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారని చెప్పారు. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు ‘అమ్మఒడి’ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి తెలిపారు.
కాగా, నెల్లూరులో సోమవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అమ్మఒడి పథకాన్ని ప్రారంభిస్తున్నారని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మొత్తం రూ.6,161 కోట్లతో అమ్మఒడి పథకం అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
జబర్ధస్త్ యాంకర్ అనసూయకు కరోనా!
బోయింగ్ 737 జకార్తాలో టేకాఫ్.. సముద్రంలో శకలాలు..?