Friday, April 26, 2024
- Advertisement -

కేటీఆర్ పంచ్ కి అంతా నవ్వులే.. కానీ వాళ్ళకి గట్టిగా తగిలింది..!

- Advertisement -

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​, బిజేపి ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్​ రావు మధ్య ట్వీట్టర్​ సంవాదం నడుస్తోంది. ఉద్యోగాలపై చర్చకు కేటీఆర్‌కు రావాలంటూ రాంచందర్‌ రావు సవాల్​ విసిరారు. ఓయూలో ఎదురుచూస్తున్నట్లు.. కేటీఆర్ ఎక్కడ ఉన్నారంటూ రాంచందర్‌ రావు ట్వీట్ చేశారు.


రాంచందర్‌రావు ట్వీట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్.. భాజపా ఇచ్చిన ఉద్యోగాలపై సమాచారం సేకరిస్తున్నామన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని.. ప్రధాని ఇస్తానన్న 12 కోట్ల ఉద్యోగాల సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. తాము చెప్పిన హామీలు తుంగలో తొక్కి ఎదుటి వారిని ప్రశ్నిస్తున్న వారి విజ్ఞత ఎంటో వారే అర్థం చేసుకోవాలని ఛలోక్తులు విసిరారు.

జన్‌ధన్ ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తామన్నారు.. ఉద్యోగాలు, రూ.15 లక్షల సాయంపై సమాచారం దొరకట్లేదని విమర్శించారు. ఎన్‌డీఏ అంటే నో డేటా అవైల్‌బుల్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే రాంచందర్‌రావు చెప్పాలని కేటీఆర్ డిమాండ్​ చేశారు. తాజాగా ఈ అంశంపై సోషల్ మీడియాలో హాట్ లాపిక్ గా మారింది.

కరోనా టీకా తీసుకున్న ప్రధాని నరేంద్రమోదీ..!

బండి బహిరంగ ప్రకటన.. ఇది సవాలే కధ..!

ఎమ్మెల్సీ కవిత అక్క.. నిజంగానే అక్కగా మారిపోయింది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -