Friday, May 17, 2024
- Advertisement -

ఎట్టకేలకు కేసిఆర్ ఆయనకే టికెట్ ఇచ్చారు..!

- Advertisement -

నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీకి తెలంగాణ రాష్ట్రసమితి అభ్యర్థిగా నోముల భగత్‌కుమార్‌కు అధిష్ఠానం టికెట్ ఇచ్చింది. ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ భగత్​కుమార్​కు బీ-ఫారమ్ అందజేశారు.

దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఇతర నేతలు కోటిరెడ్డి, గురవయ్యయాదవ్‌, రంజిత్‌యాదవ్‌, బాలరాజ్‌యాదవ్‌ తదితరులు కూడా టికెట్‌ ఆశించారు.

వీరందరి పేర్లను పరిశీలించి, సర్వేలు చేయించి… ఎట్టకేలకు టికెట్​ను భగత్​కుమార్​కు ఇచ్చారు.పార్టీ శ్రేణుల మనోభావాలకు తోడు నోముల నర్సింహయ్య పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన వారసునికి అవకాశం ఇచ్చామని కేసీఆర్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు భగత్​కుమార్ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

లాంటి వారిని దూరం పెట్టండి.. సురేఖ వాణి షాకింగ్‌ పోస్ట్‌

వరల్డ్ రికార్డ్ తో సామ్ కుమ్మెసాడు..!

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -