రక్షణ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఏకే ఆంటోని, ఆయన భార్య ఎలిజిబెత్కు కరోనా పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని ఆంటోని కుమారుడు అనిల్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.నా తల్లిదండ్రులకు కరోనా సోకింది. కొవిడ్ చికిత్స కోసం దిల్లీ ఎయిమ్స్లో చేరారు.
ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’ అని అనిల్ ట్వీట్ చేశారు.స్పందించిన సచిన్ పైలట్, రాజస్థాన్ ఎమ్మెల్యేలు… ఆంటోని దంపతులు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కనిపించింది. తాజాగా 45,576 మందికి కరోనా సోకింది. మరో 585 మంది మరణించారు.దేశంలో ఒక్కరోజే 48,493 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.బుధవారం ఒక్కరోజే 10,28,203 పరీక్షలు చేశారు. దీంతో మొత్తం కొవిడ్ నిర్ధరణ పరీక్షల సంఖ్య 12 కోట్ల 85 లక్షల 8 వేలు దాటింది.
రేడియో లో శ్రద్ధాంజలి.. ఆమె చాలా స్పెషల్..!
నకిలీ సైనికులు.. జర జాగ్రత్త..!