గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వడోదరలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగిస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆయనను కిందపడిపోకుండా పట్టుకున్నారు. నిన్నటి నుంచి వరుసగా పలు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ వస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే ఆయన బీపీ తో కళ్లు తిరిగి పడిపోయారని బీజేపీ నేతలు వెల్లడించారు.
ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వేదికపై పడిపోవడంతో అక్కడున్నవారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయన్న ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి సమస్యా లేదని వైద్యులు తెలిపారు.
కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన ఆరోగ్యం కుదుటపడిందని వెల్లడించారు. ఆ తర్వాత ఆయన అహ్మదాబాద్ వెళ్లిపోయారు. విజయ్ రూపానీ ఆరోగ్యం పట్ల ప్రధాని నరేంద్ర మోదా వాకబు చేసినట్లు సమాచారం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని పరామర్శించినట్లు సమాచారం.
ప్రేమికుల దినోత్సవానికి భార్యకు ఇచ్చిన గిఫ్ట్ తెలిస్తే.. షెభాష్ అంటారు!
ఫోటో ఫీచర్ : అందమైన చిరునవ్వు చిందిస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?