Monday, April 29, 2024
- Advertisement -

హీరోశివాజీ సంచ‌ల‌న ఆరోప‌న‌లు…ఆప‌రేష‌ణ్ ద్ర‌విడ‌

- Advertisement -

హీరో శివాజి ఓ జాతీయ పార్టీపై అణుబాంబ్ పేల్చారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆ జాతీయ పార్టీ ఆపరేషన్ పేరు మీరందరు అనుకుంటున్నట్లు ఆపరేషన్ గరుడ కాద‌ని .. ఆపరేషన్ ద్రవిడ అని బాంబు పేల్చారు. దానిలో భాగ‌మే ఆప‌రేష్‌న్ గ‌రుడ అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ జాతీయ పార్టీకి అనుబంధంగా ఉన్న ఓ సంస్థకు సంబంధించిన కల్యాణ్ జీ అనే ఓ వ్యక్తితో సదరు జాతీయ పార్టీ కుట్ర పన్నుతోందని శివాజి ఆరోపించారు. అలాగే తమిళనాడు, కేరళలో ఆపరేషన్ రావణ అని, కర్ణాటకకు సంబంధించిన ఆపరేషన్ పేరు కుమార అని పేర్లు పెట్టారు’ అని ఆరోపించారు.

ఇందుకు సంబంధించిన విషయాలన్నింటినీ తెలుపుతూ ఓ పెన్‌డ్రైవ్‌లో పొందుపర్చానని త్వరలోనే అందరికీ ఇస్తానని శివాజీ చెప్పారు. అందులో పూర్తి వివరణ ఇస్తానని తెలిపారు. ఓ కొత్త నాయ‌కుడిని జాతీయ‌పార్టీ పావులా వాడుకుంటోంద‌ని వెల్ల‌డించారు.

ఏపీ మీద ఆధిపత్యం చెలాయించడానికి ఎటువంటి చర్యలు చేపట్టారో తాను తెలుపుతానని అన్నారు. మొత్తం 4,800 కోట్ల రూపాయలు ఓ జాతీయ పార్టీ ఈ ఆపరేషన్‌ల కోసం కేటాయించిందని అన్నారు. ఏపీలో ఉన్న ప్రస్తుత రాజకీయ అవకాశాలను వాడుకునేందుకు జాతీయ పార్టీ కుట్ర పన్నిందని సంచలన ఆరోపణలు చేశారు. ఓ పెన్‌డ్రైవ్‌ ఇస్తానని, అందులో అన్ని విషయాలు తెలుసుకుని తనను మిగతా విషయాలపై ప్రశ్నించాలని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -