Monday, April 29, 2024
- Advertisement -

జగన్ సర్కార్ కి హైకోర్టు లో షాక్ మీద షాక్..!

- Advertisement -

వైఎస్ జగన్ కు మరో షాక్ తగిలింది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలకు చెందిన స్థలాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దు అని హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ తిరుమలగిరిలోని స్కూల్స్ స్థలం ఇళ్ల పట్టాలుగా ఇవ్వడంపై తప్పుపడుతూ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ సందర్భంగా స్కూళ్లు కాలేజీలు యూనివర్సిటీల స్థలాలాను ఇళ్ల పట్టాలుగా ఇవ్వొద్దంటూ ఉత్తర్వులు జారీ చేస్తూ.. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది. ఏపీలో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. అందులో అమరావతి భూములు కూడా ఉన్నాయి. అమరావతి భూముల విషయంలో చిక్కులు ఎదురౌతున్నాయి. అమరావతి భూములను పేదలకు ఇళ్ల పట్టాలుగా ఇవ్వాలన్న జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు కోర్టుకు వెళ్లడంతో దానికి బ్రేక్ పడింది.

హైకోర్టు నిర్ణయం మీద జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ సర్కారుకు చుక్కెదురైంది. ఇలాంటి సమస్యల నేపథ్యంలో ఇప్పటికి ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే ఇళ్ల పట్టాల పంపిణీలో న్యాయపరమైన సమస్యల కారణంగా ఈ కార్యక్రమం చాలా సార్లు వాయిదా పడింది. తాజాగా ఆగస్టు 15న నిర్వహించాలని భావించిన ఈ కార్యక్రమం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై కోర్టులో చర్చలు జరుగుతుండటంతో ఈ సారి ఏమవుతుందో చూడాలి.

బీజేపీ మహిళా నేత సాధినేని యామినిపై కేసు నమోదు..!

జగన్ కు షాక్.. రాజధాని అమరావతిలో మార్పు లేదు..!

చంద్రబాబు కాల్ చేస్తే.. బ్లాక్ చేసిన టీడీపీ లీడర్లు..!

అన్ని రెడ్లకేనా.. ప్రజలు ఊరుకోరు : ఎంపీ రఘురామ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -