Tuesday, May 14, 2024
- Advertisement -

వైసీపీ లో సభ్యత్వం తీసుకున్న జబర్ధస్త్ కమెడియన్

- Advertisement -

వైసీపీ మీద రోజు రోజు ప్రజల్లో ఎలాంటి పేరు ఉందో అందరికి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం పక్కా అని ఆ పార్టీ నాయకులు చేప్తున్నారు. అంతేకాకుండా ప్రజల్లో కూడా ఈ పార్టీపై విశ్వాసం పేరుగుతోంది. ప్రధానంగా జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాల ను జనల్లోకి మరింతగా తీసుకెళ్తున్నారు వైసీపీ నేతలు.

అన్ని జిల్లాల్లో ఈ పథకాన్ని వైసీపీ మరింత విస్తరిస్తోంది. దీనిపై జనం లో కూడా అనూహ్యా స్పందన లభిస్తోంది. వైఎస్‍ఆర్ కుటుంబంలో ప్రజలే స్వచ్చందంగా వచ్చి.. టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి.. వారే వైసీపీ కుటుంబంలో భాగమవుతున్నారు. రీసెంట్ గా వైసీపీ జిల్లా అధ్యక్షుడు, అనకాపల్లి కో అర్డినేటర్ గుడివాడ అమర్ నాథ్, జిల్లాలో వైసీపీ పథకాల ప్రచారంలో నాయకులతో పాల్గొంటున్నారు. తాజాగా అదే జిల్లాకు చెందిన కమెడియన్.. జబర్ధస్త్ ద్వారా బాగా పేరు సంపాధించుకున్న ఆర్టిస్ట్ అప్పారావు కూడా వైసీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ వైసీపీ సభ్యత్వం పై ఆయన మాట్లాడుతూ.. సంతోషం వ్యక్తం చేశారు.

జనాలకు ఈ పథకాలు బాగా ఉపయోగపడుతాయని.. ముఖ్యంగా వైసీపీ నాయకులు గడప గడపకూ వేళ్లి ప్రచారం చేయడం.. పథకాలు గురించి వివరించడం బాగుందన్నారు. కమెడియన్ అప్పారావుది విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెం గ్రాం. అప్పారావుతో పాటు చాలా మంది యువత వైసీపీలో సభ్యత్వం తీసుకున్నారు. అయితే అప్పరావు ముందు నుంచి రోజాకి అభిమాని. అందుకే ఆయన ఏ మాత్రం ఆలోచించకుండా వైసీపీ పార్టీ సభ్యత్వం తీసుకున్నారని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -