వచ్చే ఎన్నికల్లో తను, తన పార్టీ ప్రత్యక్ష ఎన్నికల పోటీలో ఉంటామని జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ఇది వరకే ప్రకటించారు. తను వచ్చే ఎన్నికల్లో ఒటరిగా అన్ని సీట్లలో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. మొదట బలమున్న నియోజక వర్గాల్లో మాత్రమే పోటీ చేస్తానని ప్రకటించిన జనసేనుడు తర్వాత 175 నియోజక వర్గాల్లో పోటీ చేస్తానని సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
ఇక పవన్ ప్రత్యక్ష పోటీ గురించి మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. తను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని పవన్ ప్రకటించారు. ఆ తర్వాత ఒకసారి రాయలసీమ నుంచి పోటీ అనే మాట కూడా అన్నారు. అయితే పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశంపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కృష్ణా జిల్లా ఇన్చార్జి ముత్తంశెట్టి కృష్ణారావు చేసిన ఒక ప్రకటన ఆసక్తిదాయకంగా మారింది.
జనసేన ఇన్ ఛార్జ్ ముత్తంశెట్టి కృష్ణారావు తెలిపారు. అవనిగడ్డలో ఉన్న ఆర్యవైశ్య కల్యాణ మండపంలో జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. పవన్ రానున్న ఎన్నికల్లో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేసే యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారని ప్రకటించారు.
అనంతపురం నుంచి పోటీ చేస్తానని పవన్ గతంలో ప్రకటించినా, జనసేన నేతలు మాత్రం పవన్ పోటీ అవనిగడ్డ నుంచి అని అంటున్నారు. మరో వైపు తిరుపతి నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే, పవన్ పోటీ చేసే స్థానంపై జనసేన నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.