Saturday, May 18, 2024
- Advertisement -

ప‌వ‌న్‌పై మ‌రో సారి క‌త్తి దూసిన క‌త్తి క‌హేష్‌…

- Advertisement -

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఫిల్మ్ క్రిటిక్ మహేశ్ కత్తి మరోమారు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ ఛాన‌ల్ నిర్వ‌హించి చర్చా కార్యక్రమంలో ఆయన ప‌వ‌న్‌పై ఘాటైన విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. జనసేన, పవన్ కల్యాణ్ కాపు కులం పిచ్చితో కొట్టుకుంటున్న, దళితులకు వ్యతిరేకంగా ఉన్న ఒక కులం పార్టీ ఇద‌ని మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కాపు-కమ్మలను ఒకటి చేయడానికి పవన్ కల్యాణ్ అనే పవర్ బ్రోకర్ ఆడుతున్న నాటకమిది. పవన్ కల్యాణ్ పొలిటికల్ జోకర్..పవర్ బ్రోకర్. కుల అహంకారాన్ని నరనరాన జీర్ణించుకున్న పార్టీ ‘జనసేన’. రిజర్వేషన్లు, రాజకీయాలకు సంబంధించిన అంశాలపై జనసేన పార్టీ అధికార ప్రతినిధి కల్యాణ్ దిలీప్ సుంకరకు తెలిసినంత కూడా పవన్ కల్యాణ్ కు తెలియదు’ అని మహేశ్ కత్తి విమర్శించారు.

తమిళనాట రజనీకాంత్ తన రాజకీయ అరంగేట్రంపై ప్రకటన సందర్భంగా…పార్టీ పెట్టి పోటీ చేయకుండా ఇంట్లో కూర్చుంటే పిరికిపంద అంటారు.. అంటూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను కత్తి మహేశ్ పవన్‌కు ఆపాదించిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -