రాష్ట్రంలోని చాలా నియేజకవర్గాల్లో టీడీపీలో ఉన్న విబేధాలు తారాస్థాయికి చేరుతున్నాయి. విబేధాల కారనంగానె పార్టీకి మద్దతుగా ఉన్న సామాజిక వర్గాల ఓటర్ల దూరం అవుతున్నారు. తాజాగా టీడీపీకి కంచుకోట అయిన తూర్పుగోదావరి జిల్లాలో కమ్మ సామాజిక వర్గం బాబుకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
త్వరలో జరగనున్న కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలలో కమ్మసామాజిక వర్గాన్ని టీడీపీ-భాజాపా కూటమి విస్మరించడంతో రగిలిపోతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి దాదాపు పదివేల ఓట్లు ఉన్నాయి. అయితే వీరికి భాజాపా-టీడీపీ కూటమి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కడివిజన్ను కూడా కేటాయించకపోవడంతో కాపు సామాజిక వర్గం రగిలోపోతున్నారు. సొంతపార్టీ నాయకులు కూడా చిన్న చూపు చూసు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కీలక సంయంలో కమ్మ సామాజిక వర్గం నేతలందరూ సమావేశ మయ్యారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో టీడీపీలో అలజడి మొదలయ్యింది. ఈ ఎన్నికల్లో కమ్మ వర్గానికి వైసీపీ పెద్దపీట వేస్తుండటంతో ఆపార్టీకే మద్దతు ఇవ్వాలని నిర్నయించినట్లు తెలుస్తోంది. మరో సారి సమావేశ మయ్యి తుది నిర్నయం తీసుకోనున్నారు.
కమ్మ సామాజిక వర్గాన్ని టీడీపీ పూర్తిగా విస్మరించడంతో….పూర్తి స్థాయిలో వైసీపీకి మద్దతు తెలిపితే టీడీపీ కంచుకోట బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక వైపు నంద్యాల ఉప ఎన్నిక…మరో వైపు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు అధికార పార్టీకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఓటర్లు ఇచ్చే తీర్పకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.