Thursday, May 2, 2024
- Advertisement -

మహానాడు ఎఫెక్ట్… జేసీకి షాక్ ఇచ్చిన జగన్ అభిమానులు

- Advertisement -

మహానాడులో రెచ్చిపోయి మరీ వైఎస్‌ల గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన జేసీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ అభిమానులు. నోరుంది కదా అని రెచ్చిపోయి మాట్లాడిన జేసీకి అదే తరహాలో కౌంటర్ ఇచ్చారు. ఆ దెబ్బతో జేసీకి సొంత జిల్లాలోనే ఎప్పుడూ ఎదురవని అనుభవం ఎదురైంది. ఇప్పుడు ఈ అంశం టిడిపిలో హాట్ టాపిక్ అయింది. వైఎస్‌ల పై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసిన జేసీకి తిక్క కుదిరిందన్న విశ్లేషణలు స్థానికంగా కూడా వినిపిస్తున్నాయి.

మహానాడు తర్వాత నుంచీ జేసీ దివాకరరెడ్డి స్థానిక ఫోన్ నంబర్ పనిచెయ్యడం లేదు. ఎందుకా అని ఆరా తీసినవాళ్ళందరూ కూడా టెక్నికల్ ప్రాబ్లమేమో అనుకున్నారు. అయితే అసలు విషయం ఆలస్యంగా తెలిసింది. ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ లేదా……..మాట్లాడే స్వేచ్ఛ లేదా అంటూ మహానాడు వేదికగా రెచ్చిపోయి మాట్లాడిన జేసీకి జగన్ అభిమానులు కూడా అదే స్థాయిలో రెచ్చిపోయి వరుసగా కాల్స్ చేశారని తెలుస్తోంది. కొందరైతే హద్దుమీరి మరీ తిట్ల వర్షం కురిపించారట. రాత్రి, పగలు అనే తేడాలేకుండా ఫోన్ మోత మోగించడంతో జేసీనే సైలెంట్‌గా ఫోన్ స్విఛాఫ్ చేసుకున్నాడని తాజాగా జేసీ వర్గీయులు చెప్పుకొచ్చారు. కేవలం ఢిల్లీ నంబర్‌ మాత్రమే ప్రస్తుతం జేసీ వాడుతున్నాడని…….స్థానికంగా ఉపయోగించే నంబర్‌ని పూర్తిగా పక్కనపెట్టాడని జేసీ వర్గీయులు చెప్తున్నారు. వైఎస్‌ల అభిమానుల దెబ్బకే జేసీకి ఈ పరిస్థితి వచ్చిందన్న సెటైర్స్ అనంతపురంలో ఓ రేంజ్‌లో పేలుతూ ఉండడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -